YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

అక్రమ సంబంధం.. మామను చంపించిన కోడలు

 అక్రమ సంబంధం.. మామను చంపించిన కోడలు
తన వివాహేతర సంబంధానికి అడ్డుచెబుతున్నాడన్న అక్కసుతో మామను కోడలు తన ప్రియుడి సాయంతో హత్యచేయించింది. డిసెంబరు 22న కామారెడ్డి జిల్లాలో వృద్ధుడు హత్యకు గురికాగా, పోలీసుల విచారణలో విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాన్సువాడ సమీపంలోని చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన హతుడు బీర్కూర్ గంగారాం (60) కుమారుడు విఠల్‌తో లావణ్యకు వివాహం జరిగింది. అయితే, విఠల్ అంతగా తెలివైనవాడు కాకపోవడంతో తన పక్కింట్లో ఉండే పృథ్వీరాజ్ అలియాస్ రాజుతో లావణ్య వివాహేతర బంధం పెట్టుకుంది. ఏడాది కాలంగా సాగుతోన్న ఈ వ్యవహారం మామ గంగారాంకు తెలియడంతో ఆమె మందలించాడు. ఈ విషయంలో లావణ్య, రాజులను తీవ్రంగా హెచ్చరించడంతో అతడిపై కోపం పెంచుకుంది. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని లావణ్య నిర్ణయించుకుంది. డిసెంబరు 22 సాయంత్రం కూడా మరోసారి దీనిపై మామా కోడళ్లు గొడపడ్డారు. ఈ విషయాన్ని ప్రియుడు రాజుకు తెలియజేసి, మామను చంపేయాలని కోరింది. వెంటనే అతడి మొబైల్‌కు మెసేజ్ పంపి మామ గంగారాం ఇంటి నుంచి బయటకు వెళ్లిన విషయాన్ని తెలిపింది. కుంట్లమోరి వంతెన నిర్మాణం జరుగుతుండగా, గంగారాం అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. గొడవ జరిగిన తర్వాత వంతెన వద్దకు వెళ్లిపోయిన గంగారాం అక్కడ టిప్పర్ క్యాబిన్‌లో నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి 2.30 గంటలకు అక్కడకు వెళ్లిన రాజు, నిద్రపోతున్న గంగారాంపై కత్తితో దాడి చేశాడు. దీంతో మేల్కొన్న గంగారాం అందులో నుంచి దూకి పారిపోతుండగా మెడపై కత్తితో నరికి, కాళ్లుచేతులపై కూడా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన గంగారాం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులకు దాడికి ఉపయోగించిన కత్తి ఘటనాస్థలంలో లభించింది. దీని ఆధారంగా విచారణ చేపట్టడంతో అసలు నిజం వెలుగుచూసింది. లావణ్య కాల్ డేటా కూడా పరిశీలించగా ప్రియుడికి మెసేజ్ పంపిన విషయం బయటపడింది. నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించారు. 

Related Posts