YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏపీలో మోదీ పర్యటన వాయిదా!

ఏపీలో మోదీ పర్యటన వాయిదా!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. జనవరి 6న ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఆకస్మికంగా నిర్ణయించిన కార్యక్రమాలతో ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో ప్రధాని పర్యటన ఉండే అవకాశం ఉంది.తొలుత నిర్ణయించిన ప్రకారం ప్రధాని జనవరి 6న కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించాలన్నది ప్రణాళిక. కేరళ భాజపా వర్గాలు నిర్ణయించిన ప్రకారం తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మోదీ మధ్యాహ్నం నుంచి ఏపీ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. అందుకు అనుగుణంగా గుంటూరు నగరంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగాయి. అయితే ఆకస్మికంగా నిర్ణయించిన కార్యక్రమాలతో మోదీ పర్యటన వాయిదా పడింది.కాగా అసలు విభజన హామీలు అమలు,ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏ మోహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారు, వస్తే రాకుండా అడ్డుకుంటామని,ఈ మేరకు నిరసన ప్రదర్శనకు టీడీపీ శ్రేణులు కూడా సిద్ధం అవుతున్నాయి,ఇందుకు అధినాయకుడు పిలుపు ఇవ్వటం కూడా జరిగింది.

Related Posts