YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

మెట్రో స్టేషన్‌లో ఈవ్ టీజింగ్

Highlights

  • లిఫ్ట్‌లో యువతి పట్ల అసభ్యం 
  • మెట్రో ఉద్యోగిపై కేసు నమోదు 
మెట్రో స్టేషన్‌లో ఈవ్ టీజింగ్

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మెట్రో ఉద్యోగిపై కేసు నమోదయింది. అమీర్‌పేట మెట్రో ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్‌ వహీదుద్దీన్‌ తెలిపారు. సికింద్రాబాద్‌కు చెందిన యువతి(22) రసూల్‌పురా వెళ్లేందుకు జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌లో రైలెక్కింది. అమీర్‌పేట ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌లో దిగి రెండో అంతస్తులో రైలు మారాల్సి ఉండటంతో లిఫ్ట్‌ ఎక్కింది. మెట్రో స్టేషన్‌లో టికెటింగ్‌, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగిగా పని చేస్తున్న ట్రిగ్‌ డిటెక్టివ్‌ సర్వీసెస్‌కు చెందిన నితిన్‌రెడ్డి(25) లిఫ్ట్‌లో యువతితో పాటే ఎక్కాడు.  ఆ యువతిని అసభ్యంగా తాకాడు.   అదేవిధంగా పునరావృతం చేయడంతో బాధితురాలు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Posts