
కన్న తల్లి కడుపు లోంచి...
బయట పడి..తొలి సారి ఊపిరిని.. పీల్చిన క్షణం నుంచి పుడమి తల్లి కడుపు లోకి చేరు కునేందుకు ఆఖరి సారి ఊపిరి ని...విడిచి పెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే
"నేను"
ఈ "నేను"- ప్రాణశక్తి అయిన ఊపిరికి మారు పేరు.
ఊపిరి ఉన్నంత దాకా ‘నేను’ అనే "భావన "కొన సాగు తూనే ఉంటుంది.
జనన మరణాల మధ్య కాలం లో సాగే జీవన స్రవంతి లో.
_ఈ ‘నేను’ ఎన్నెన్నో పోకడలు పోతుంది._
_మరెన్నో విన్యాసాలూ చేస్తుంది._
_ఈ ‘నేను’ లోంచే..._
_‘నాది ’ అనే భావనా పుడు తుంది._
_‘నాది’లోంచి..._
_నా వాళ్ళు,_
_నా భార్య,_
_నా పిల్లలు,_
_నా కుటుంబం,_
_నా ఆస్తి,_
_నా ప్రతిభ_
_నా ప్రజ్ఞ,_
_నా గొప్ప...అనేవీ..._ _పుట్టు కొచ్చి చివరికి..._
*_ఈ ‘నేను’ అనే భావన భూ మండలాన్ని కూడా మించి పోయి..._*
*_ఆకాశపు సరిహద్దును కూడా దాటి పోయి, నిలు వెత్తు..._*
*_విశ్వ రూపాన్ని దాల్చిన ‘అహం’గా ప్రజ్వరిల్లు తుంది._*
*_‘అహం’ అనే "మాయ పొర" కమ్మేసిన స్థితి లో ఈ ‘నేను’ ‘నేనే సర్వాంత ర్యామిని’ అని విర్ర వీగు తుంది._*
_నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకు తుంది._
_పంతాలతో పట్టింపులతో,_
_పగలతో ప్రతీ కారాలతో తన ప్రత్యర్థిని సర్వ నాశనం చేయ డానికీ సిద్ధ పడు తుంది._
_బాల్య,_
_కౌమార,_
_యౌవన,_
_వార్ధక్య దశల దాకా విస్ఫు లింగ తేజం తో విజేతగా నిలిచిన_ _‘నేను’ అనే ప్రభ..._
_ఏదో ఒకనాడు మృత్యు స్పర్శతో కుప్ప కూలి పోతుంది._
_వంది మాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులు తుంది._
_సుందరీ మణులతో మదనోత్సవాలు జరుపు కొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది._
_సుఖ భోగాలతో, అష్టైశ్వర్యాలతో తుల తూగిన_
_‘నేను’- చుట్టూ చేరిన బంధు మిత్ర సపరి వారపు..._
_జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారు తుంది._
_కడ సారి చూపుల కోసం,_
_కొన్ని ఘడియల పాటు ఆపి ఉంచిన విగత జీవికి అంతిమ యాత్ర మొదలవు తుంది._
_మరు భూమి లో_
_చితి మంటల మధ్యే సర్వ బంధనాల నుంచీ విముక్తి కలుగు తుంది._
_మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనం తో సహా,_
_మొత్తంగా కాలి బూడిద అవు తుంది._
_నేనే శాసన కర్తను,_
_నేనే..._
_ఈ భూ మండలానికి అధిపతిని,_
*_"నేనే" జగజ్జేతను"..._*
_అని మహోన్నతం గా భావించిన_
*_‘నేను’ లే కుండానే మళ్ళీ తెల్ల వారు తుంది._*
_రోజు మారు తుంది._
*_ఊపిరి తో మొద లై ఊపిరి తో ఆగిన... "నేను" కథ ...అలా... సమాప్త మవు తుంది._*
_అందుకే..._
*_ఊపిరి ఆగక ముందే "నేను" గురించి_*
*_తెలుసు కో- అంటుంది. భగవద్గీత..._*
*_చితి మంటలను చూస్తు న్నప్పుడు... కలిగేది._*
*_శ్మశాన వైరాగ్యం మాత్రమే..._*
*_అది శాశ్వతం కానే కాదు._*
*_"నేను" గురించిన సంపూర్ణ మైన అవగాహనతో ఉన్నప్పుడే..._*
*_పరిపూర్ణ మైన వైరాగ్య స్థితి సాధ్యమవు తుంది._*
*_వైరాగ్యం అంటే అన్నీ వది లేసు కోవడం కానేకాదు._*
*_దేని మీదా మోహాన్ని కలిగి ఉండక పోవడం, తామరాకు మీద నీటి బొట్టులా జీవించ గలగడం._*
*_స్వర్గ నరకాలు ఎక్కడో లేవు._*
*_మన లోనే ఉన్నాయి._*
*_మనిషికి..._*
*_ఆత్మ దృష్టి నశించి బాహ్య దృష్టి తో జీవించడమే - "నరకం"..._*
*_అంతర్ముఖుడై నిత్య సత్య మైన ఆత్మ దృష్టిని పొంద గలగడమే - "స్వర్గం"._*
*_ఈ జీవన సత్యాన్ని తెలియ చేసే దే వేదాంతం._*
*_నిజాయతీగా,_* *_నిస్వార్థంగా,_* *_సద్వర్తనతో,_* *_సచ్ఛీలతతో భగవత్ ధ్యానం తో_*
*_జీవించ మనే 'దే వేదాంత సారం._*
*_‘అహం బ్రహ్మాస్మి’- 'అంటే '-_*
*_‘అన్నీ నేనే’ అనే స్థితి నుంచి..._*
*_‘త్వమే వాహమ్’... అంటే-_*
*_‘నువ్వే "నేను’ అని..._* *_భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపు కోగల తాదాత్మ్య స్థితిని చేరు కోగలిగి తేనే..._*
*_మానవ జన్మకు సార్థకత సిద్ధిస్తుంది..!_*