YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలోనే పెట్రో మంట

కర్ణాటకలోనే పెట్రో మంట

అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. శనివారం (జనవరి 5) దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ 15-16 పైసలు మేర, డీజిల్ ధర లీటరుకు 18-20 పైసల వరకు తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 15 పైసలు తగ్గి రూ.68.29 వద్ద ఉండగా.. డీజిల్ ధర 18 పైసలు తగ్గి రూ.62.26 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 15 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.74.10 ఉండగా.. డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ.65.34 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ 57.06 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 47.96 డాలర్ల వద్ద కొనసాగుతోంది.మోటారు ఇంధనాలపై అమ్మకం పన్నును పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు 2 రూపాయల వరకు పెరిగాయి. పెట్రోలు ధరను రూ.1.79 మేర, డీజిల్ ధరను రూ.1.83 మేర పెంచింది. దీంతో శనివారం నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ధరల ప్రకారం.. పెట్రోల్‌ ధర రూ.1.52 పెరిగి రూ.70.53 చేరగా.. డీజిల్‌ ధర రూ.1.5 పెరిగి రూ.64.30 కి చేరింది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 16 పైసలు తగ్గి రూ.72.44 వద్ద, డీజిల్ 20 పైసలు తగ్గి రూ.67.68 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్‌ ధర 15 పైసలు తగ్గి రూ.72.02 వద్ద, డీజిల్‌ ధర 20 పైసలు తగ్గి రూ.66.93 వద్ద కొనసాగుతున్నాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర 15 పైసలు తగ్గి రూ.70.43 కి చేరగా.. డీజిల్ ధర 18 పైసలు తగ్గి రూ.64.03 కి చేరింది. చెన్నైలో పెట్రోల్‌ ధర 21 పైసలు తగ్గి రూ.71.01 వద్ద, డీజిల్‌ ధర 23 పైసలు తగ్గి రూ.65.91 వద్ద కొనసాగుతున్నాయి.

Related Posts