YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రత్యేక హోదాఫై టిడిపి, బిజెపి పార్టీ మద్య ఎదురుదాడి

ప్రత్యేక హోదాఫై టిడిపి, బిజెపి పార్టీ మద్య ఎదురుదాడి
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటూ పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఎంపీలు సోమవారం ఆందోళన చేశారు. తమిళనాడు మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్‌ వేషధారణలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ నిరసన తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. విశాఖ రైల్వేజోన్‌పై ప్రకటన చేయాలంటూ డిమాండ్‌ చేశారు.కాగా తెదేపా ఎంపీల నిరసనపై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడికి దిగింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నిరసన తెలుపుతున్న ఎంపీల వద్దకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ చేరుకుని మీడియాను పిలిపించి మాట్లాడారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు తెలుగు దేశం పార్టీ ఆనందంగా అంగీకరించిందని, ఆ తర్వాత మాట మార్చిందని గోయల్‌ విమర్శించారు. ఏపీలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చేందుకే ఆందోళన పేరిట తెదేపా.. ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. తెలంగాణలో తెదేపాను ప్రజలు తిరస్కరించారని, ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారన్నారు.గోయల్‌ మాట్లాడుతుండగా తెదేపా ఎంపీలు జోక్యం చేసుకుని మీ మంత్రిత్వ శాఖ నుంచి ఏం చేశారో చెప్పాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ప్యాకేజీపై కాకుండా రైల్వే జోన్‌ గురించి చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైల్వే జోన్‌ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని గోయల్‌ వారికి సమాధానమిచ్చారు.

Related Posts