YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స్టెరిలైట్ కు సుప్రీం ఓకే

 స్టెరిలైట్ కు సుప్రీం ఓకే
తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి పరిశ్రమను తమిళనాడు ప్రభుత్వం మూసివేయడం ప్రకృతి నీతికి విరుద్ధమని జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో స్టెరిలైట్ పరిశ్రమ పునఃప్రారంభానికి అనుమతిస్తూ గ్రీన్ ట్రైబ్యునల్‌ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీనిని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఎన్జీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తమిళనాడు పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ విషయంలో వేదాంత సంస్థ అభిప్రాయాన్ని కోరింది. స్టెరిలైట్ ప్లాంట్‌కు సంబంధించి గతేడాది తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు జారీచేసిన వేర్వేరు ఆదేశాలను ఎన్జీటీ తప్పుగా అర్థం చేసుకుందని తమిళనాడు ప్రభుత్వం కోర్టు తెలియజేసింది. అయితే, పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు, హానికర పదార్ధాలను నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఎన్జీటీ తాజా ఉత్తర్వుల్లో ఆదేశించింది. తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ రాగి పరిశ్రమను మూసివేయాలంటూ ఆందోళనలు చేసిన నిరసనకారులపై 2017 మేలో పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ పరిణామాల నేపథ్యంలో పరిశ్రమను రాష్ట్రప్రభుత్వం మూసివేయడం, దానిని సవాల్‌ చేస్తూ వేదాంత గ్రూప్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై అధ్యయనానికి ఎన్జీటీ ఓ కమిటీ ఏర్పాటు చేయగా, ఆ కమిటీ డిసెంబరు 7 నివేదిక ఇచ్చింది. దీంతో డిసెంబరు 15న స్టెరిలైట్ కాపర్ పరిశ్రమ పున:ప్రారంచిండానికి అనుమతి ఇవ్వాలని ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చింది. 

Related Posts