YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్ కు జై కొట్టినందుకు పంజరంలో బంధించారు

 భారత్ కు జై కొట్టినందుకు పంజరంలో బంధించారు

దుబాయ్ లో తాజాగా జరిగిన ఏషియన్ ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడిన సంగతి తెలిసిందే.. అయితే మ్యాచ్ కు ముందు దుబాయ్ లోని భారత్ ఫుట్ బాల్ జట్టు అభిమానులు భారత్ జట్టుకు మద్దతుగా జై కొట్టినందుకు దుబాయ్ షేక్ ఆగ్రహించాడు. తన వద్ద పనిచేస్తున్న 20 మంది భారత అభిమానులను పంజరంలో బంధించి హింసించాడు. యూఏఈకి జై కొట్టేంత వరకు విడిచిపెట్టనని కర్రపట్టుకొని బెదిరించాడు. దీంతో భారత అభిమానులు యూఈఏకి బలవంతంగా జై కొట్టారు. ఈ తతంగమంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీంతో సదురు షేక్ చిక్కుల్లో పడ్డారు. భారత అభిమానులను బంధించిన దుబాయ్ షేక్ పై యూఏఈ ప్రభుత్వం ఆగ్రహించింది. వెంటనే షేక్ ను అరెస్ట్ చేయాలని యూఏఈ అటార్నీ జనరల్ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో దెబ్బకు దిగివచ్చిన షేక్ తాను తన దగ్గర 20 ఏళ్లుగా పనిచేస్తున్న భారత అభిమానులతో సరదాగా ఈ ఆట ఆడామని.. తాను బలవంతంగా వారిని బంధించి చెప్పలేదని బుకాయించాడు. తామంతా ఒక కంచం మంచంలో పడుకుంటామని.. అదంతా ఉత్తిదేనని కవర్ చేశాడు. మరి దీనిపై యూఏఈ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుదనేది ఆసక్తిగా మారింది.

Related Posts