YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యూపీ, బీహార్ లలో బీజేపీకి సీన్ లేదు

యూపీ, బీహార్ లలో బీజేపీకి సీన్ లేదు

2019 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లో భారతీయ జనతా పార్టీ గెలవదు అని రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజస్వి యాదవ్ తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. నిన్న లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి తేజస్వి యాదవ్ రాబోయే ఎన్నికలపై మాట్లాడారు. మాయావతి, అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయాన్ని యూపీ ప్రజలు స్వాగతిస్తారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవదని స్పష్టం చేశారు. ఎస్పీ, బీఎస్పీ అన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలను ఓడించడం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమవుతుందన్నారు తేజస్వి యాదవ్.

Related Posts