YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమిత్ షా కడప పర్యటన రద్దు

అమిత్ షా కడప పర్యటన రద్దు

కడప లో శుక్రవారం జరగాల్సిన అమిత్ షా పర్యటన రద్దు అయింది  ఆయన ప్లేస్ లో రాజనాధ్ సింగ్,రాం మాధవ్ వస్తున్నారు.  షెడ్యూల్ ప్రకారం మీటింగ్ జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు.  రెండు మాసాల్లో ఎన్నికలు పెట్టుకుని దొంగ శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ విషయం లో మెకాన్ సంస్థ కు సకాలంలో సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం మోసం ,అబద్దాలు చెప్తూ నీచ రాజకీయాలు చేస్తున్నాడు. తన కున్న మీడియా ను అడ్డం పెట్టుకొని  తాను చెప్పేటటువంటి అబద్దాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం మేము చెప్పే నిజాలని మా గొంతులో నొక్కడం లో ఆయన  మీడియా కూడా ప్రయత్నం చేస్తుందని అయన అన్నారు. కడప జిల్లా కు స్టీల్ ప్లాంట్ ఆలస్యం అవడానికి నూటికి నూరు పాళ్లు చంద్రబాబు మోసపురితమైన ఆలోచనలు మాత్రమే. హైకోర్టు నిర్మాణం కోసం 2017 లో కేంద్రం500ప్ కోట్లు ఇస్తే  బిల్డింగ్స్ రెడీ అని కేంద్రాన్ని ,సుప్రీంకోర్టు ను తప్పు దోవ పట్టించి తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. చంద్రబాబు మోసాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న మీడియా ఎందుకు చూపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి  కి లబ్ది చేకూర్చడం కోసం విభజన చేసారని పిచ్చి కూతలు కూస్తున్న బాబు  మతి స్థిమితం లెకుండా మాట్లాడుతున్నాడని అయన విమర్శించారు.

Related Posts