Highlights
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము
- ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు సోమవారం 18.02.2018 ఉ!! 5 గంటల సమయానికి,
• ఆదివారం 76,326 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
• వైకుంఠం 'క్యూ' కాంప్లెక్స్ లో 03 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
• ప్రత్యేక దర్శనం (₹: 300)వారికి 02 గంటలసమయం పడుతుంది.
• నిత్యం నడక మార్గమున అర్థరాత్రి 12:00 గంటల నుండి అలిపిరి 14, శ్రీవారిమెట్టు 6 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును
• మొత్తం 20 వేల టోకెన్లు పూర్తియిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి
• కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.
• సర్వదర్శనానికి 05 గంటల సమయం పట్టవచ్చు.
• ఆదివారం స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.70 కోట్లు.
• ఆదివారం 31,256 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.