YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సిద్దగంగ మఠాధిపతి కన్నుమూత

సిద్దగంగ మఠాధిపతి కన్నుమూత
కర్ణాటకలోని సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి (111) కన్నుమూశారు. శివకుమార్ స్వామి గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. లింగాయత్ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా పూజించే శివకుమార్ స్వామి వయసు 111 ఏళ్లు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల స్వామికి డిసెంబరు 8వతేదీన వైద్యులు ఆపరేషన్ చేశారు. శివకుమారస్వామి ఆరోగ్యం విషమించడంతో  కన్నుమూశారు.
శివకుమారస్వామి పరిస్థితి విషమంగా ఉందని సోమవారం ఉదయం వైద్యులు ప్రకటించండంతో భక్తులు మఠానికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప సోమవారం తన కార్యక్రమాలను రద్దు చేసుకొని తుముకూరులోని మఠానికి వచ్చారు.  శివకుమార్ స్వామి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పోలీసులు సిద్ధగంగా మఠం వద్ద పోలీసుల భద్రతను పెంచారు.  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర కుడా  సిద్ధగంగా మఠానికి  వచ్చారు.

Related Posts