YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బడ్జెట్ హల్వ షురూ

 బడ్జెట్ హల్వ షురూ
బడ్జెట్‌ 2019 కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా సోమవారం ఆర్థికశాఖ కార్యాలయంలో హల్వా వేడుక ప్రారంభించారు. దీంతో నేటి నుంచే మధ్యంతర బడ్జెట్‌ కాగితాల ముద్రిస్తారు. బడ్జెట్ హల్వా వేడుకలో రవాణ శాఖ మంత్రి పొన్‌ రాధకృష్ణన్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి డీఈఏ సుభాష్‌ గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రతి బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. బడ్జెట్‌‌కు సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారన్న విషయం తెలిసిందే. బడ్జెట్‌ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఆర్థికశాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. బడ్జెట్‌ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇందులో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. బడ్జెట్ కాగితాల ముద్రణ ప్రారంభానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు. కానీ ఈసారిఆర్థిక మంత్రి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లడంతో పాల్గొనలేదు. దీంతో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్‌ పాల్గొన్నారు. జైట్లీ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అమెరికా నుంచి వస్తారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఆయనే మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 
1950 వరకు బడ్జెట్‌ ప్రతులను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించే వారు. కానీ అక్కడ అవి లీక్‌ కావడంతో దానిని మింట్‌ రోడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌కు మార్చారు. ఆ తర్వాత 1980లో దీనిని నార్త్‌బ్లాక్‌లోని బేస్‌మెంట్‌కు మార్చారు. అప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతోంది. బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు. బంధువులకు కూడా ఫోన్‌ చేసుకొనే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్‌ చేసుకోవచ్చు. కాగా ఆర్థిక మంత్రి కూడా బడ్జెట్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు ఉంచుకోరు. ఇవి మొత్తం జాయింట్‌ సెక్రటరీ ఆధీనంలో ఉంటాయి.తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నట్లు పథకం ప్రకారమే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ చిన్న పార్టీ కాదని, కేంద్రంలో ఎన్ని పార్టీలు కలిసిని బీజేపీ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ఏపీలోనూ బీజేపీ పుంజుకుంటోందని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం తమదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూ.2వేలకు పెంచడం కచ్చితంగా ఎన్నికల స్టంటేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. అమరావతి సభ పేరుతో అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విష్ణుకుమార్ రాజు బీజేపీని వీడి మరో పార్టీలో చేరనున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో సీఎం చంద్రబాబుపై టీడీపీ నేతలకు మించి ప్రశంసలు కురిపించడంతో ఆయన టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఈరోజు జనసేన పార్టీలో చేరుతుండటంతో విష్ణుకుమార్ రాజు కూడా కచ్చితంగా పార్టీ మారతారని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాన్ని కొట్టిపడేసిన ఆయన తనకు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 

Related Posts