YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి కాకుండా జనవరి నుండే!

 ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి కాకుండా జనవరి నుండే!
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు కాకుండా జనవరి నుంచి డిసెంబర్‌గా పరగణించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వ్యవసాయంతో అనుసంధానం చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్‌లో ముఖ్యమంత్రులతో సమావేశంలో భాగంగా జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. వ్యవసాయ ఆదాయం ఎంతో ముఖ్యమైన ఇండియాలాంటి దేశాల్లో ఆ ఆదాయం అందిన వెంటనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అవసరం అని మోదీ అభిప్రాయపడ్డారు. జూన్‌లో వర్షాకాలం వస్తుంది. కానీ రాష్ర్టాలు వివిధ పథకాలు, వ్యయాలను అక్టోబర్‌కుగానీ మొదలుపెట్టలేకపోతున్నాయి.దీని వల్ల సగం ఏడాది మాత్రమే పథకాల అమలు జరుగుతున్నది. అందుకే రెండేళ్ల కిందటే ఆర్థిక సంవత్సరాన్ని జనవరి 1 నే మొదలయ్యేలా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా కేంద్రం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆర్థిక సంవత్సరాన్ని మార్చడానికి గల కారణాలు వివిధ పంటలు, వ్యాపారాలపై దాని ప్రభావం, పన్నుల వ్యవస్థలో మార్పుల్లాంటి వివిధ అంశాలపై నివేదికను తయారు చేసి కేంద్రానికి అందజేసింది. ఇప్పటికే బడ్జెట్‌ను నెల రోజుల ముందుగా ఫిబ్రవరి 1నే ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ 1నుంచి కొత్త బడ్జెట్‌ను అమలు చేసే వీలు కలుగుతున్నది. ఇక రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపేశారు.

Related Posts