YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

విడుదలే కాలేదు.సీక్వెల్లా..?

Highlights

  •  'బాఘీ-2' షూటింగ్  దశే
విడుదలే కాలేదు.సీక్వెల్లా..?

 'బాఘీ-2' షూటింగ్ జరుగుతుండగా దీని సీక్వెల్‌ కూడా రాబోతుందని అహ్మద్ ఖాన్ దానికి దర్శకత్వం వహిస్తాడని సాజిద్ నదియావాలా టీం ప్రకటించింది.సాధారణంగా  ఒక సినిమా విజయాన్ని బట్టి.. దానికి సీక్వెల్‌ను ప్రకటిస్తుంటారు దర్శకనిర్మాతలు. అయితే బాలీవుడ్‌లో మాత్రం సినిమా రిలీజ్ అవ్వకముందే సీక్వెల్‌ను ప్రకటించారు.
అయితే తెలుగులో మంచి విజయం సాధించిన 'వర్షం' రీమేక్‌గా 'బాఘీ' తెరకెక్కగా.. అందులో టైగర్ ష్రాప్, శ్రద్ధా కపూర్ నటించారు. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో 'బాఘీ-2'ను అనౌన్స్ చేసిన దర్శకనిర్మాతలు రెండవ పార్ట్‌ను 'క్షణం' రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైగర్ ష్రాఫ్ సరసన దిశా పటానీ నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మూడో పార్ట్‌ను ప్రకటించి అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నారు.

Related Posts