YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

'వందే భారత్' ఎక్స్ ప్రెస్

'వందే భారత్' ఎక్స్ ప్రెస్

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన  స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ట్రైయిన్‌’18‌కు కేంద్రం పేరు పెట్టింది. ఇకపై ఈ రైలును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పిలవాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా చొరవతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూపుదిద్దుకొందని గోయల్ ట్వీట్ చేశారు. ఓ వీడియోను కూడా కేంద్రమంత్రి పోస్ట్ చేశారు. ట్రైయిన్‌ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల నుంచి అభిప్రాయాలను కోరామన్నారు గోయల్. వేల సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయని.. చివరికి‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’గా పేరు పెట్టామన్నారు. దేశ ప్రజలకు రిపబ్లిక్ డే సందర్భంగా అందిస్తున్న బహుమతి.. ప్రధాని మోదీ దీన్ని త్వరలోనే ప్రారంభించాలని కోరుతున్నామన్నారుఢిల్లీ-వారణాసి మధ్య తిరగనున్న ఈ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు. 16 కోచ్‌లు ఉన్న ఈ ట్రెయిన్ రాయ్‌బరేలీలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూ.97 కోట్ల వ్యయంతో 18 నెలల్లోనే సిద్ధమయ్యింది. దేశంలోనే ఇది తొలి లోకోమోటివ్-లెస్ రైలుగా గుర్తింపు పొందింది. పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకుంది.

Related Posts