YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

రైల్లో ప్రత్యక్షమైన కేంద్రమంత్రి..

Highlights

  •   సెల్ఫీల కోసం పోటీపడ్డ  ప్రయాణికులు
  • కావేరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో
  •  రైల్లో ప్రయాణించిన కేంద్ర  మంత్రి పియూష్ గోయల్
  •  అందుబాటులోకి  ఎక్స్‌ప్రెస్ రైలు
రైల్లో ప్రత్యక్షమైన కేంద్రమంత్రి..

 సామాన్య ప్రయాణికుల సాధక బాధలు స్వయంగా తెలుసుకునేందుకు ఓ కేంద్ర మంత్రి చొరవ తీసుకోవడం చాలా అరుదు. అయితే కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ మంగళవారం ఆ తరహా ప్రయత్నంతో అందర్నీ ఆకట్టుకున్నారు. రైల్వే ప్రయాణికుల సమస్యలను స్వయంగా నిర్ధారించుకునేందుకు ఓ రైల్లో ప్రయాణం చేశారు. స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకోవడం గమనార్హం. తమిళనాడు రాజధాని చెన్నై, కర్నాటకలోని మైసూరు మధ్య ప్రయాణించే కావేరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో గోయల్ ప్రయాణించారు. ప్రయాణికులతో ముచ్చటిస్తూ.. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. రైలు లోపల వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు, అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
వాస్తవానికి మైసూరు రైల్వే స్టేషన్లో ఓ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించేందుకు ఆయన ప్రధాని మోదీతో కలిసి మైసూరు వచ్చారు. ప్యాలెస్ క్వీన్ హంసాఫర్ పేరుతో పట్టాలెక్కించిన కొత్త రైలును.. కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్తగా విద్యుదీకరించిన మైసూరు, బెంగళూరు రైల్వే మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది.

Related Posts