YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైల్వే బడ్జెట్ కు రూ.64,587 కోట్లు

 రైల్వే బడ్జెట్ కు  రూ.64,587 కోట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశ రైల్వే చరిత్రలోనే గతేడాది అతి తక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరిగిన సంవత్సరంగా మిగిలిపోయిందన్నారు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించామన్నారు. ఈశాన్య భారతదేశంలో సైతం రైల్వేలైన్ల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో రైల్వేలకు రూ.64,587 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మేఘాలయాలను రైల్వేలైన్లతో అనుసంధానం చేసిన ఘనత తమ సర్కార్‌దే అన్నారు. గతేడాది ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేశాఖకు రూ.1.48 లక్షల కోట్లు కేటాయించగా.. తాజా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో అందులో సగం నిధులు కేటాయించారు. ప్రతిరోజు దాదాపు 27 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు సైతం చేపట్టామని పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎక్స్‌ప్రెస్ రైలును రూపొందించామని, దానికి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అని నామకరణం చేసినట్లు చెప్పారు. ఢిల్లీ-వారణాసి మధ్య ఈ రైలు గంటకు 160కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు. గరిష్టంగా 180 కి.మీ వేగంతో రైలు ప్రయాణించగలదని తెలిపారు. 

Related Posts