YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మధ్య తరగతి బడ్జెట్

మధ్య తరగతి బడ్జెట్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారం తుది బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకూ సంస్కరణల దిశగా అడుగులేసిన మోదీ సర్కారు.. చివరి బడ్జెట్‌‌లో జనాకర్షక పథకాలను చోటు కల్పిస్తోంది. ఓట్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ.. రైతాంగం, మధ్యతరగతి ప్రజలు, పేదలు, వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం వరాలు కురిపిస్తోంది. ఉదయం 11 గంటలకు గోయల్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. 2019-20కిగానూ జైట్లీ స్థానంలో పీయూష్ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గోయల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 
✔ పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై రూ.10 వేల నుంచి రూ.40 వేలకు ఆదాయ పన్ను పరిమితి పెంపు. 
✔ అద్దెల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రూ.1.80 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంపు. 
✔ వేతన జీవులకు ఊరట. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. సెక్షన్ 80సీ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. రూ.6.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు ప్రావిడెంట్ ఫండ్స్, ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే పన్నులు కట్టనక్కర్లేదు. 3 కోట్ల కుటుంబాలకు లబ్ధి.
✔ ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ. 76,800 కోట్లకు పెంపు. గత బడ్జెట్లో రూ.62,474 కోట్ల కేటాయింపు. 
✔ మూలధన వ్యయం - రూ.3,36,292 లక్షల కోట్లు 
✔ నోట్ల రద్దు తర్వాత 1.06 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. 24 గంటల్లోగా ఆదాయ పన్ను రీఫండ్ అయ్యేలా చర్యలు. 
✔ వచ్చే ఐదేళ్లలో 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్, ఎనిమిదేళ్లలో 10 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న ఇండియా. 
✔ ఇళ్ల కొనుగోలు దారులను జీఎస్టీ నుంచి మినహాయించే విషయమై త్వరలోనే నిర్ణయం. 
✔ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏర్పాటు. ఐదెకరాల లోపు రైతులకు ఏటా రూ.6 వేల రూపాయలు అందిస్తాం. 12 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. రూ. 2 వేలు చొప్పున మూడు వాయిదాల్లో చెల్లింపు. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ. ఈ పథకం కోసం ఏటా రూ.75 వేల కోట్లు ఖర్చు. 
✔ ప్రధాని శ్రమ యోగి మంధన్ పేరిట అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం పెన్షన్ పథకం. నెలకు రూ.100 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేలు. పది కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 
✔ పన్నులు లేకుండా గ్రాట్యూటీ పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ఓవరాల్‌గా గ్రాట్యూటీని రూ.30 లక్షలకు పెంపు. 
✔ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రూ.58,166 కోట్లు కేటాయింపు. గత ఏడాది కంటే ఇది 21 శాతం అధికం. 
✔ రైల్వేకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ.64,587 కోట్ల నిధులు. 
✔ 59 నిమిషాల్లోనే సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు కోటి రూపాయల రుణం. 
✔ కార్మిక ప్రమాద బీమా రూ.6 లక్షలకు పెంపు. 
✔ రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయింపు. 
✔ ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన ద్వారా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
✔ ముద్రా కింద రూ.7 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. 
✔ కేంద్రంలో ప్రత్యేకంగా మత్స్య శాఖ ఏర్పాటు. 
✔ 21 ఎయిమ్స్‌ కార్యకలపాలు నిర్వహిస్తున్నాయి లేదా నిర్మాణ దశలో ఉన్నాయి. 
✔ పేదలకు 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు ఇచ్చాం. 
✔ ఆవాస్ యోజనలో భాగంగా 1.53 లక్షల ఇళ్లు నిర్మించాం. 
✔ గ్రామ్ సడక్ యోజన కోసం రూ.19 వేల కోట్లు ఖర్చుపెట్టాం. 
✔ ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ కోడ్ ద్వారా రూ.3 లక్షల కోట్లు రికవరీ చేయగలిగాం. 
✔ స్వచ్ఛతను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాం. 5.45 లక్షల గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనకు దూరమయ్యాయి. 
✔ ఐదేళ్లలో సంస్కరణలను చేపట్టాం. ద్రవ్యలోటును 2.5 శాతానికి తగ్గించాం. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యింది. 
✔ ఈ నాలుగున్నరేళ్లలో 239 డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులను తేగలిగాం. 2008-14 మధ్య రుణభారం వేగంగా పెరిగింది. 
 
అంతకు ముందు మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో గోయల్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీకి ఎన్డీయే సర్కారు అన్యాయం చేసిందని విమర్శిస్తూ తెలుగు దేశం పార్టీ ఎంపీలు నల్ల దుస్తుల్లో పార్లమెంట్ ముందు నిరసన చేపట్టారు. బడ్జెట్‌ను ఆమోదించడానికి కేబినెట్ భేటీ అయ్యింది. కేబినేట్ ఓకే చెప్పిన తర్వాత గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ బీఫ్ కేసుతో పార్లమెంట్‌కు చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రపతి కోవింద్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. బడ్జెట్ 2019-20 ప్రతులను ఇప్పటికే పార్లమెంట్‌కు పంపించారు

Related Posts