YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

విశాఖ రైల్వే జోన్‌కు మళ్లీ మెలిక

Highlights

  • ఎలా సాధ్యమంటున్నతూర్పుకోస్తా
  • ఒడిశా రాజకీయాలే మూలం 
  • ఒడిశా మినహించాలి..
విశాఖ రైల్వే జోన్‌కు మళ్లీ మెలిక

కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ కి రైల్వే జోన్ ఇవ్వండి., మాకేం అభ్యంతరం లేదన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన తూర్పుకోస్తా రైల్వేలో భాగమైన వాల్తేరు డివిజన్ విభజన మా ఆమోదం లేకుండా ఎలా సాధ్యమంటూ మోకాలు అడ్డుపుట్టుంది.
తూర్పుకోస్తా రైల్వేకి వాల్తేరు డివిజన్ ప్రధాన ఆదాయవనరు. ఈ తరుణంలో వాల్తేరు డివిజన్‌ను ఏపీకి కేటాయిస్తే, తూర్పుకోస్తా జోన్ నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది. ఆగ్నేయ రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను 2003లో విడదీసి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటు చేశారు. ఒడిశాలోని ఖుర్దారోడ్‌తో పాటు ఏపీలోని వాల్తేరు, ఇంకో రాష్ట్రంలోని సంబల్‌పూర్ డివిజన్‌లతో కలిపి కొత్త జోన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాల్తేరు డివిజన్‌లో భాగంగా ఉన్న జగదల్‌పూర్, కిరండూల్, కోరాపుట్, నవరంగ్‌పూర్ ప్రాంతాలను విడదీసి తాము మూడేళ్లుగా అడుగుతున్న రూర్కెలా, జైపూర్, రాయగడ డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్నది ఒడిశా వాదన. 
ఒడిశాలో మూడు కొత్త రైల్వే డివిజన్లు కావాలని మూడేళ్లుగా కోరుతున్నాం. రైల్వే పరంగా మా అభ్యర్థనలు మన్నించిన మీదటే ఏపీకి జోన్ ప్రకటించుకోవాలంటూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈసారి బడ్జెట్‌లో కేంద్రం నుంచి రైల్వే పరంగా తాము రూ.3,160 కోట్ల రూపాయల నిధులు కోరితే, కేవలం రూ.1,420 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించడాన్ని ఒడిశా ప్రభుత్వం ప్రస్తావించింది. ఇదిలాఉండగా ఇప్పటికే ఒక ప్రతిపాదన రైల్వే మంత్రిత్వ శాఖ ముందుంచినట్టు సమాచారం. 
వాల్తేరు డివిజన్‌లో భాగంగా ఉన్న ఒడిశా ప్రాంతాన్ని మినహాయించి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనికి స్పందనగానే ఒడిశా నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఈ అంశాన్ని మరింత జఠిలం చేయడం ద్వారా ఇప్పట్లో పరిష్కారానికి అవకాశం లేకుండా చూసే ధోరణిలో కేంద్రం వెళ్తుతున్నాయని అనుమానాన్ని రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. 
 ఒడిశా ప్రభుత్వం కోరుతున్నట్టు ఒడిశాలో కొత్తగా మూడు డివిజన్లు ఏర్పాటు చేయాలంటే తూర్పుకోస్తాతో పాటు ఆగ్నేయ రైల్వే, ఆగ్నేయ మధ్య రైల్వేలను పునర్విభజించాలి. అంటే మూడు జోన్లను అస్థిర పరచడంకంటే యథాతథ స్థితిని కొనసాగించడమే మంచిదన్న ఉద్దేశంతో కేంద్రం 'రైల్వేజోన్' అంశాన్ని సాగదీస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశాలో కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యం కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారును రైల్వేజోన్ ప్రకటనపై మీమాంసలో పడేట్టు చేసిందన్న ప్రచారం సాగుతోంది.

Related Posts