YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

రైల్వేస్టేషన్లో ప్రేమజంటపై దాడి..

రైల్వేస్టేషన్లో ప్రేమజంటపై దాడి..
జిల్లాలోని సూళ్లూరు పేటలో దారుణం జరిగింది. స్థానికి రైల్వే స్టేషన్ లో కామాంధులు పైశాచికంగా ప్రవర్తించారు. రాత్రి రైలు ఎక్కేందుకు ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రేమ జంటను బెదిరించి యువతిని తీసుకెళ్లి వివస్త్రను చేశారు. రైలు పట్టాల వెంబడి కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఐదుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. కాకినాడకు చెందిన యువకుడు, బాధిత యువతి శ్రీసిటిలోని ఓ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. తమతమ ఊళ్లకు వెళ్లేందుకు బోకారో ఎక్స్ప్రెస్ జనరల్ బోగి ఎక్కేందుకు ఒకటో ప్లాట్ఫామ్ చివరిలో ఉన్న బేంచిపై కూర్చున్నారు.
 ప్లాట్ ఫామ్ చివర వుండడం, నిర్మానుషంగా వుడడంతో ఆ జంటపై కామాంధుల కన్ను పడింది. ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన ప్రియుడిపై దాడి చేశారు. ఆపై ఆమెపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. బాధిత యువతి, ప్రియుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిసరాలను పోలీసులు పరిశీలించారు. తీవ్ర రక్తస్రావం అయి గాయాలతో విలవిల్లాడుతున్న యువతిని గుర్తించి ఆసుప్రతికి తరలించారు. 

Related Posts