YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

చిన్న విమానానికి ప్రభుత్వం ఆమోదం 

Highlights

  • పైలట్ అమోల్ తో రూ.35,000 కోట్లకు  బిజినెస్ డీల్ 
  • పైలట్ అమోల్ యాదవ్ శ్రమ ఫలించింది  
చిన్న విమానానికి ప్రభుత్వం ఆమోదం 

పైలట్ అమోల్ యాదవ్  చెందిన  థ్రస్త్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించనున్న ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్‌ కు ప్రభుత్వ ఆమోదం లభించింది. ముంబైకి చెందిన  పైలట్ అమోల్ యాదవ్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చిన్నసైజు విమానం నమూనాను రూపొందించారు. ఈ విషయం తెలుసుకున్న పైలట్, కంపెనీ సభభాగస్వామి అయిన అమోల్ యాదవ్‌ను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భారీ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం  రూ.35,000 కోట్ల బిజినెస్ డీల్ కుదుర్చుకుంది. ఈ క్రమంలో పాల్ఘర్ జిల్లాలోని కెల్వే ప్రాంతంలో ఎయిర్‌క్రాఫ్ట్స్‌ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ముందుకు వచ్చింది.ఆరుసీట్ల సామర్థ్యం ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌లు రూపొందించేందుకు థ్రస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్‌మెంట్‌తో వేలకోట్ల ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాల్ఘర్ ని ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఫడ్నవీస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం ముడిసరుకు, ఇతరత్రా సౌకర్యాలను కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  
ఏడాది అనంతరం కేవలం తన ఇంటి టెర్రస్ మీదనే ఎయిర్‌క్రాఫ్ట్ కు కావలసిన విడి భాగాలను సమకూర్చుకున్నారు. 2017 నవంబర్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు యాదవ్ రూపొందించనున్న ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్‌ను అప్రూవ్ చేశారు. కానీ ఇప్పటివరకూ దాన్ని పరీక్షించలేదు. కొన్ని రోజుల్లో విడి భాగాలను అమర్చి ఎయిర్‌క్రాఫ్ట్ ను అందిస్తానని యాదవ్ ధీమాగా ఉన్నారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎయిర్‌క్రాఫ్ట్‌ను టెస్ట్ చేయున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. 

Related Posts