
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
న్యూజిలాండ్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా విఫలమైంది. కివీస్ పేసర్ల ధాటికి భారత్ విలవిలలాడిపోయింది. ఎంఎస్ ధోనీ (39; 31 బంతుల్లో 5×4, 1×6), శిఖర్ ధావన్ (29; 18 బంతుల్లో 2×4, 3×6), విజయ్ శంకర్ (27; 18 బంతుల్లో 2×4, 2×6) మినహా మరెవ్వరూ రాణించలేదు. కృనాల్ పాండ్య (20; 18 బంతుల్లో 1×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. 19.2 ఓవరల్లో భారత్ 139 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.