YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

 అవిశ్వాసం  ఆఖరి ఆస్త్రం కావాలి

 అవిశ్వాసం  ఆఖరి ఆస్త్రం కావాలి


 ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా.. నిధులూ ఇవ్వకపోతే ఎలా? అని పయ్యావుల వ్యాఖ్యానించారు. అవిశ్వాసం అనేది ఆఖరి ఆస్త్రం కావాలని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తేల్చిచెప్పారు. కేంద్రం ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.మంగళవారం సాయంత్రం అనంతలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నామని కేశవ్ స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఏపీ హక్కును ఎందుకు వదులుకోవాలని అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అవిశ్వాసం సరిపోదని ఆయన స్పష్టం చేశారు. ఒకసారి అవిశ్వాసం పెట్టి అది వీగిపోతే పార్లమెంట్ లో ప్రస్తావించే వీల్లేకుండా పోతుందని పయ్యావుల చెప్పుకొచ్చారు.చట్టాలు తెలియని వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. 

Related Posts