YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం

Highlights

  • బడ్జెట్‌ అంశాలకు ఆమోద ముద్ర
  • కేంద్ర ప్రభుత్వ సాయం అంశంపైనా చర్చ
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్
నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం

 రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ తెలిపారు. అవురావతిలోని సచివాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. కాగా ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్  ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్‌లో పెట్టాల్సిన కొన్ని కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అంతేకాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తుతం సందిగ్థత ఏర్పడిన పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మేరకు సాయం అందవచ్చనే అంశంపైనా మంత్రి మండలి చర్చించనున్నట్లు సమాచారం.

Related Posts