
టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఆఖరి టీ20లో కివీస్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ మూడు వికెట్లు కోల్పోయి 212పరుగులు చేసింది.టీమిండియా బౌలర్లు చేతులెత్తేయడంతో ఆ జట్టు ముందు 213 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచారు. ఓపెనర్లు కొలిన్ మన్రో(72), సీఫెర్ట్(43)రాణించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు చేయగలిగింది. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ చెరో వికెట్ తీశారు.