YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగులకు 2.092 శాతం డీఏ విడుదల.

Highlights

  • కేబినెట్ నిర్ణయాలు
  • నవాయుగా కంపెనీకి 1244 కోట్ల పనుల అనుమతి
  • కేబినెట్ ఆమోదం.
ఉద్యోగులకు 2.092 శాతం డీఏ విడుదల.

ఉద్యోగులకు డీఏ
• రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
• 2015 వేతన సవరణ మేరకు 22.008 శాతం నుంచి 24.104 శాతం మేరకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
• దీనివల్ల 2.096 శాతం పెరుగుదల లభించింది. యూజీసీ స్కేల్ వర్తించే వారికి 132 నుంచి 136 శాతానికి డీఏ పెరగనుంది.
• అలాగే, గ్రామ రెవిన్యూ సహాయకులకు ఇస్తున్న మొత్తానికి అదనంగా నెలకు రూ.300 చొప్పున తాత్కాలిక పెంపు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
• పెంచిన కరవు భత్యం నగదు రూపంలో ఈ ఏడాది ఏప్రిల్ 1న తీసుకునే మార్చి నెల జీతం నుంచి అందిస్తారు.
• పాత బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలోకి జమ చేస్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మార్చి నెల వేతనం నుంచే డీఏ పెంపు వర్తిస్తుంది.
• కరవు భత్యం పెంపు వల్ల ప్రతి నెలా రూ.69.91 కోట్లు, ఏడాదికి రూ.838.87 కోట్ల చొప్పున భారం పడనుంది. గ్రామ సహాయకులకు పెంచే రూ.300 వల్ల ఏడాదికి రూ.6.57 కోట్ల భారం పడనుంది.
• ఈ రెండూ కలిపి ప్రభుత్వంపై రూ.845.44 కోట్ల భారం పడుతుంది.
పోలవరంలో కాంక్రీట్ పనులు చేపట్టే ఏజెన్సీకి నిధులు
• పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రూ.1244.36 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతులు ఇస్తూ మంత్రిమండలి ఆమోదం.
ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకు స్వయం ప్రతిపత్తి కల్పించే డ్రాఫ్టు బిల్లుకు ఆమోదం:
• ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుకు స్వయం ప్రతిపత్తి కల్పించే డ్రాఫ్టు బిల్లుకు మంత్రిమండలి ఆమోదం.
• రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎటువంటి భయాలు లేకుండా వివాదరహితంగా ఉండేలా చూడటానికి బోర్డుకు స్వయం ప్రతిపత్తి కల్పించే బిల్ల దోహదపడుతుందని మంత్రిమండలి భావించింది.
• ఏపీ ఈడీబీ చట్టం 2018 అనుసరించి స్టేట్ ఇన్వెస్టుమెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్టుమెంట్ ప్రమోషన్ కమిటీలకు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించేలా బిల్లు రూపొందించారు.
విశాఖ, తిరుపతిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు :
విశాఖలో 2.7 ఎకరాలలో సెంటర్ :
• జీవీఎంసీ పరిధిలో కుటుంబ వినోద కేంద్రం (ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్-FEC) ఏర్పాటుకు విశాఖపట్నంలోని 2.7 ఎకరాలను SPI సినిమాస్ ప్రెవేట్ లిమిటెడ్ (డెవలపర్)కు కేటాయించేందుకు GVMC కమిషనరుకు అనుమతి ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• 33 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన SPI సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయిస్తారు.
• లీజు రూపంలో మొదటి ఏడాది రూ. 4.284 కోట్లు చెల్లించాల్సి వుంటుంది. ఏడాదికి 5% చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా ఒప్పందం కుదుర్చుకుంటుంది.
• మొత్తం రూ. 25 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకోనుంది.
• పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపడతారు.
• APTDC ప్రాథమికంగా దీని ఖర్చులను భరించి పర్యాటక ప్రాజెక్టుగా దీన్ని నిర్వహిస్తుంది.
తిరుపతిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ :
• తుడా పరిధిలో కుటుంబ వినోద కేంద్రం (ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్-FEC) ఏర్పాటుకు తిరుపతి అన్నమయ్య సర్కిల్‌లో 3.72 ఎకరాలలో SPI సినిమాస్ ప్రెవేట్. లిమిటెడ్ (డెవలపర్)కు కేటాయించేందుకు తుడా వైస్ చైర్మన్‌కు అనుమతి ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• 33 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన SPI సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయిస్తారు.
• లీజు రూపంలో మొదటి ఏడాది రూ. 3.265 కోట్లు చెల్లించాల్సి వుంటుంది. ఏడాదికి 5% చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా ఒప్పందం కుదుర్చుకుంటుంది.
• మంత్రుల సాధికార కమిటీ చేసిన సిఫారసుల మేరకు మంత్రిమండలిలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
• మొత్తం రూ. 25 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకోనుంది.
• పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపడతారు.
• 23 వేల చ. అ. విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్, 80 వేల చ. అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టులు, వాణిజ్య సముదాయం ఏర్పాటు చేస్తారు. 6 మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్లతో ఐమ్యాక్స్ ధియెటర్, 3 స్టార్ల హోటల్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో వారు ప్రతిపాదించిన రూముల కంటే ఎక్కువ సంఖ్యలో రూములను నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.
• APTDC ప్రాథమికంగా దీని ఖర్చులను భరించి పర్యాటక ప్రాజెక్టుగా దీన్ని నిర్వహిస్తుంది.
42 నాన్ అమృత్ పట్టణాలలో మౌలిక సదుపాయాలు :
• ఎక్స్‌టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల క్రింద ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ (AIIB) చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు పబ్లిక్ హెల్త్ & మెడికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని సింగిల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా నియమిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• రూ.4,188.71 కోట్ల మొత్తం ప్రాజెక్టు వ్యయం కోసం పరిపాలనా ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,116.99 కోట్లు, ఆయా పురపాలక సంస్థలు రూ.465.41 కోట్లు, ఎక్స్‌టెర్నల్ ఏజెన్సీల నుంచి రూ.2,066.31 కోట్లు చొప్పున ప్రాజెక్టుకు ఫైనాన్సింగ్‌ చేస్తాయి.
• 42 నాన్ అమృత్ పట్టణాల స్థానిక సంస్థలలో మౌలిక సదుపాయాల సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లై అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (APUWSSMIP) కింద ఈ ప్రాజెక్టు చేపడతారు.
• ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరుకు ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టుమెంటు బ్యాంకుతో వివిధ ఒప్పందాలను చేసుకునే బాధ్యతను అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

ఏసీబీలో నూతన నియామకాలు :
• యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)లో కొత్తగా 350 పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
• ఇందులో 300 ఖాళీలను నేరుగానూ, మిగిలిన 50 ఖాళీలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది.
• రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టినందున ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూసేందుకు ఏసీబీని బలోపేతం చేయాలని మంత్రివర్గం భావించింది.
• జాయింట్ డైరెక్టర్ స్థాయి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ వరకు వివిధ స్థాయిల్లో ఈ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.
• నేరుగా భర్తీ చేసే 300 పోస్టులకు గాను ఏడాదికి రూ. 23.57 కోట్లు జీతాల రూపంలో చెల్లించాల్సి వుంటుంది.
• 50 అవుట్ సోర్సింగ్ పోస్టులకు ఏడాదికి రూ. 84.36 లక్షలు వ్యయం కానుంది.
• మొత్తం రూ. 24.41 కోట్లు ఇందుకోసం ఖర్చు కానుంది.
సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నియామకాలు :
• కృష్ణాజిల్లా గన్నవరంలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ – సీనియర్ సివిల్ జడ్జిల కోర్టు కోసం కొత్తగా 25 పోస్టులు మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
• ఇందులో సీనియర్ సివిల్ జడ్జి, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు వున్నాయి.
• ఈ పోస్టుల భర్తీతో ఏడాదికి రూ. 1.46 కోట్లు ఖర్చు కానుంది.
స్పీకర్ కోసం పీఆర్వో నియామకం :
• శాసన సభాపతికి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌ని నియమించేందుకు వీలుగా ఒక పోస్టును సృష్టిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
• ముందుగా ఒక సంవత్సరం కాలంపాటు డిప్యూటేషన్ విధానంలో సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి భర్తీ చేసుకోవాల్సి వుంటుంది.
విజయవాడలో ప్రభుత్వ ఉర్ధూ జూనియర్ కళాశాల :
• విజయవాడ విద్యాధరపురంలో వార్డు నెంబర్ 13లో ప్రభుత్వ ఉర్ధూ జూనియర్ కళాశాల ఏర్పాటుకు 0.92 సెంట్ల భూమిని కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
శ్రీకాకుళంలో ఇండస్ట్రియల్ పార్కు :
• శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలోని 44.97 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం APIICకి ఉచితంగా అందిస్తూ మంత్రిమండలి నిర్ణయం.

Related Posts