YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజకీయ మెరుపుదాడులకు ఇది సమయం కాదు

రాజకీయ మెరుపుదాడులకు ఇది సమయం కాదు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
రాజకీయ మెరుపుదాడులకు ఇది సమయం కాదని శివసేన పార్టీ కేంద్రంపై విమర్శలు చేసింది. పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ తమ పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పిస్తూ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘ఉరీలో ఉగ్రదాడి జరిగిన తరువాత మెరుపుదాడులు నిర్వహించారు. కానీ, అసలైన మెరుపుదాడులు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టేందుకు అమెరికా.. పాకిస్థాన్‌లోకి ప్రవేశించి, అతడిని హతమార్చింది. వీటిని మెరుపుదాడులు అంటారు. ఇది రాజకీయ ప్రత్యర్థులపై మెరుపుదాడులు చేయడానికి తగిన సమయం కాదు. జవాన్ల మృతికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై దాడి చేయాలి’ అని పేర్కొంది.‘ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని మన ప్రధాని అంటున్నారు. ఇలా చెప్పడం కాకుండా చేసి చూపాలి. ఎల్‌టీటీఈ వేర్పాటువాదుల్ని తొలగించడంలో అప్పట్లో శ్రీలంక ప్రభుత్వం చూపిన ధైర్యాన్ని మన ప్రభుత్వం కూడా చూపితే, పాకిస్థాన్‌ వంటి 100 దేశాలనైనా భారత్‌ ఎదిరించగలదు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. మన జవాన్లకు మద్దతుగా నిలబడాల్సిన సమయం’ అని శివసేన సామ్నాలో పేర్కొంది. ‘దేశం.. ఎంతో మంది ఆగ్రహావేశాలను, రాజకీయ విజయాలను చూసింది. కానీ, ఇప్పటి వరకు కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లేదు. జవాన్లపై ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు’ అని విమర్శించింది.

Related Posts