YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాక్ ను తిడితే రూ.10 డిస్కౌంట్.. వ్యాపారి బంపరాఫర్

 పాక్  ను తిడితే రూ.10 డిస్కౌంట్.. వ్యాపారి బంపరాఫర్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

ఛత్తీస్ గఢ్ లోని జగ్దల్ పూర్ లోని రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ నడుపుతున్నఅంజల్ సింగ్.. కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చాడు. పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే చాలు.. ఫుడ్ ఐటమ్స్పై రూ.10 డిస్కౌంట్ ప్రకటించాడు. పుల్వామాలో సైనికులపై దాడి తర్వాత యావత్ భారతావని పాక్ తీరుపై భగ్గుమంటోంది. మన సైనికుల్ని పొట్టనబెట్టుకున్న దాయాది దేశంపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ నినదిస్తోంది. ఇలా పాక్ పేరు చెబితే చాలు స్కూలుకు వెళ్లే పిల్లవాడు కూడా ఒంటి కాలుతో పైకి లేస్తున్నాడు. ఇప్పుడు ఇదే నినాదాన్ని వ్యాపారులు సైతం అనుకూలంగా మార్చుకుంటున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ నినాదాన్ని అందుకుంటున్నారు.  
మొన్నే ఢిల్లీలో ఓ వ్యాపారి ‘పాకిస్థాన్ ముర్దాబాద్.. రూ.1100కే మూడు జతల షూలు’అంటూ వ్యాపారం చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో వ్యాపారి కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఛత్తీస్ గఢ్ లోని జగ్దల్ పూర్ లోని రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ నడుపుతున్నఅంజల్ సింగ్.. కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించాడు.  
పాకిస్థాన్ ముర్దాబాద్ అంటే చాలు.. ఫుడ్ ఐటమ్స్ పై రూ.10 డిస్కౌంట్ ప్రకటించాడు. పాకిస్థాన్ ఎన్నడూ మానవీయతకు విలువనివ్వదు.. అందుకే ప్రతి ఒక్కరూ మనసు లోతుల్లో నుంచి పాకిస్థాన్ ముర్దాబాద్’’ అని నినదించాలంటూ పిలుపునిచ్చాడు. అంజల్ సింగ్ ఆఫర్ కు జనాలు కూడా ఫిదా అయ్యారు. కొందరు పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ డిస్కౌంట్ అందుకుంటున్నారు. 

Related Posts