YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోదీ ప్రధాని కాని పక్షంలో...దేశం 50 ఏళ్లు వెనక్కి’ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

మోదీ ప్రధాని కాని పక్షంలో...దేశం 50 ఏళ్లు వెనక్కి’                  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కాని పక్షంలో దేశం 50ఏళ్లు వెనక్కి వెళుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు కొనసాగాలంటే మరోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బెంగుళూరులో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించకపోతే.. తొలిసారి ఓటు వేయబోతున్న యువతరాన్ని నిరాశకు గురిచేసినవారవుతారని ఆమె వ్యాఖ్యానించారు. మోదీ వంటి నాయకుడు చాలా అరుదుగా లభిస్తారంటూ ప్రధాని పనితీరును ప్రశంసించారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. భాజపా హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని ఆమె అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. కార్యకర్తలు 2013-14 కంటే ఇప్పుడు పదింతలు కష్టపడాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కూడా నిర్మలా సీతారామన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భాజపాపైన బురదజల్లడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. గత ఐదేళ్లలో కశ్మీర్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగిన దాఖలాలు లేవని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో సైనికులకు కనీసం బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కూడా లేవని ఆరోపించారు. కానీ గత ఐదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఆధునిక సాంకేతికతను సైన్యానికి సమకూర్చామన్నారు. అందుకోసం గత రక్షణ శాఖ మంత్రులు మనోహర్‌ పారికర్‌, అరుణ్‌ జైట్లీ విశేషంగా కృషి చేశారన్నారు. పుల్వామా దాడిపై స్పందిస్తూ..  పాక్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. రఫేల్‌ డీల్‌పై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసిన ఆమె.. సెప్టెంబరు 19న తొలి రఫేల్‌ యుద్ధ విమానం భారత్‌కు రానుందని తెలిపారు.

Related Posts