YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వాయు సేన దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

వాయు సేన దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున  భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్-2 జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల జవాన్లకు సెలవులు రద్దు చేసింది. పాక్ నుంచి ప్రతీకార దాడులు ఉంటాయనే అనుమానంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, భారత సరిహద్దు మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం పాక్-భారత్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

Related Posts