YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వ్యక్తి కన్నా పార్టీ గొప్పది... పార్టీ కన్నా దేశం గొప్పది

వ్యక్తి కన్నా పార్టీ గొప్పది... పార్టీ కన్నా దేశం గొప్పది

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మాతృదేశంపై ఒట్టేసి చెబుతున్నా..దేశాన్ని ఎవరి ముందు తలదించనివ్వను అని ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. రాజస్థాన్ లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మెరుపు దాడుల వీరులకు నమస్కరిద్దాం అని అన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని ఇస్తున్నానని, దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురానని, జాతి ప్రయాణం ఆగదు, విజయయాత్ర కొనసాగుతుందని చెప్పారు.‘జై జవాన్-జై కిసాన్’ నినాదంతో ముందుకు సాగుతున్నామని,వ్యక్తి కన్నా పార్టీ గొప్పది, పార్టీ కన్నా దేశం గొప్పదన్న భావనతో పని చేస్తున్నామని అన్నారు. భారతావని ఎప్పుడూ తలఎత్తుకునే ఉంటుందని, దేశం మేల్కొని ఉంది, ప్రతి భారతీయుడికి విజయం లభిస్తుందని అన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నానని, దేశ రక్షణలో అమరులైన సైనికుల స్మృత్యర్థం నిన్న యుద్ధ స్మారకం ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ రాష్ట్రానికి చెందిన అనేక మంది యువకులు సరిహద్దుల్లో కాపలాగా నిలబడ్డారని, ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. కాగా,పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దళాలు, యుద్ధ విమానాలతో దూసుకెళ్లి బాంబులేసి వచ్చిన విషయం తెలిసిందే.. మెరుపు దాడుల వీరులకు శిరస్సు వంచి నమస్కరిద్దామన్నారు. దేశానికి, జాతికి ఎన్నటికి తలవంపులు తీసుకురానన్నారు. సగర్వ భారతవని తల ఎత్తుకునే ఉంటుందన్నారు. దేశం సురక్షితమైన చేతుల్లో ఉందనే విశ్వాసాన్ని నేను ఇస్తున్నా అన్నారు. దేశం మేల్కొని ఉందన్నారు మోదీ. ప్రతీ భారతీయుడికి విజయం లభిస్తుందన్నారు. ఈరోజు భారతదేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజున్నారు ప్రధాని. జాతి నిర్మాణంలో భాగస్వామ్యులైన వారందరికి ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నా అన్నారు. సైనిక సంక్షేమాన్ని అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన అనేకమంది ఆర్మీలో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. వ్యక్తి కన్నా పార్టీ గొప్పది... పార్టీ కన్నా దేశం గొప్పదన్న భావనతో పనిచేస్తున్నామన్నారు. దేశ గౌరవ మర్యాదల్ని మంటగలిపే చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు ప్రధాని. భారత జాతి ప్రయాణం ఆగదన్నారు. విజయవంతంగా ఈ ప్రయాణం కొనసాగుతుందన్నారు మోదీ.

Related Posts