YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హెలికాప్టర్‌ కూలి నేపాల్‌ పౌరవిమానయాన శాఖ మంత్రి మృతి

హెలికాప్టర్‌ కూలి నేపాల్‌ పౌరవిమానయాన శాఖ మంత్రి మృతి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

నేపాల్‌ పర్యాటక, పౌరవిమానయాన శాఖ మంత్రి రబీంద్ర అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ బుధవారం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. మంత్రితో పాటు మరో ఐదుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో మంత్రి చనిపోయిన విషయాన్ని ఆ దేశ విమానయానశాఖ ధ్రువీకరించింది. పఠిభర ప్రాంతంలో ఈ చాపర్‌ కూలిపోయింది. కెప్టెన్‌ ప్రభాకర్‌, టూరిజంయ ఎంటర్‌ప్రెన్యూర్‌ అంగ్‌ ఛిరాంగ్‌ శ్రేప, సెక్యూరిటీ పర్సనల్‌ అర్జున్‌, ప్రధానమంత్రి సన్నిహితుడు యుబ్రార్‌ దాహల్‌, బీరేందర శ్రేష్టతో పాటు మరో వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.పెద్ద శబ్దంతో విమానం కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పఠిభర ప్రాంతంలోని ఆలయంలో పూజలు నిర్వహించి కాఠ్‌మాండూ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే.. చాపర్‌ కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తొలుత చాపర్‌ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కొద్దిసేపటికి స్థానికులు పఠిభర ప్రాంతంలో హెలికాప్టర్‌ కూలడంతో పెద్ద ఎత్తున పొగలు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించారు.

Related Posts