YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అభినందన్ ను భారత రాయబారికి అప్పగించిన పాక్

అభినందన్ ను భారత రాయబారికి అప్పగించిన పాక్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కు అప్పగించారు. బుధవారం జమ్మూ కశ్మీర్లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో ఐఏఎఫ్ కి చెందిన మిగ్ 21 యుద్ధవిమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయింది. పాక్ విమానాలను తిప్పికొట్టిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జనీవా ఒప్పందం ప్రకారం ఆయనను వెంటనే బేషరతుగా స్వదేశానికి తిప్పి పంపాలంటూ భారత్ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య శాంతిని ఆకాంక్షిస్తూ అభినందన్ ను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

Related Posts