YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కమలం గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే

కమలం గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కర్ణాటకలో కాంగ్రెస్ కు సొంతపార్టీ ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ పెద్ద షాకిచ్చారు. తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆ లేఖను స్పీకర్ కు అందజేశారు. కలబుర్గి జిల్లా చించోలి నుంచి ఉమేష్ జాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. జాదవ్ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న కర్ణాటక పర్యటనకు వస్తున్నారని.. ఆ వేదికపైనే ఉమేష్ బీజేపీలో చేరతారని తెలుస్తోంది. జాదవ్ చాలా రోజులుగా పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. రెండు నెలల క్రితమే పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ రెబల్స్ ఎమ్మెల్యేలలో జాదవ్ కూడా ఒకరు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జాదవ్ రాజీనామాతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ఓ ఎమ్మెల్యే తగ్గినట్లయ్యింది. బడ్జెట్ సమావేశాల సమయంలో డబ్బు ఎరవేసి తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జేడీఎస్-కాంగ్రెస్ లు  కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప ఓ జేడీఎస్ ఎమ్మెల్యేతో బేరసారాలు చేస్తున్నట్లు ఆడియో టేపును ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేశారు. ఆ గొడవ సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో ఉమేశ్ యాదవ్ రాజీనామా చేయడం కలకలంరేపింది. అధికారం కోసం కాదు.. షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం జాదవ్ బీజేపీలోకి వస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉమేష్ జాదవ్.. కలబుర్గి నియోజకవర్గం బరిలోకి దిగబోతున్నారే ప్రచారం కూడా జరుగుతోంది. జాదవ్ చించోలి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వృత్తిరీత్యా డాక్టరైన జాదవ్.. రాజకీయ రంగ ప్రవేశం కంటే ముందు కలబుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్ గా  పని చేశారు.

Related Posts