YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీహార్ లో ఎన్డీయేకు 40 సీట్లు వస్తాయి

బీహార్ లో ఎన్డీయేకు  40 సీట్లు వస్తాయి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
త్వరలో జరగబోయే లో్ సభ  ఎన్నికల్లో బీహార్ లో  40 లోక్ సభ స్థానాల్లో గెలుస్తామని, ఈ విషయంలో ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నానని ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. తద్వారా మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి తీసుకువచ్చి మోదీని ప్రధానమంత్రి చేస్తామన్నారు. నిన్న పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించిన సంకల్ప్ ర్యాలీలో ప్రధాని మోదీతో పాటు సీఎం నితీష్ పాల్గొన్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్న ప్రధాని మోదీని నితీష్ కొనియాడారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చర్యలను నితీష్ ప్రశంసించారు. ఉగ్రవాదం విషయంలో రాజీ పడే సమస్య లేదని బీహార్ సీఎం తేల్చిచెప్పారు.

Related Posts