YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీ వెబ్సైట్ హ్యాకింగ్

బీజేపీ వెబ్సైట్ హ్యాకింగ్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
బీజేపీకి చెందిన వెబ్సైట్ హ్యాకింగ్కు గురైంది. ప్రధాని మోదీని కించపరుస్తూ హ్యాకర్లు మీమ్స్ పోస్టు చేశారు. ఈ అంశం క్షణాల్లోనే వైరల్గా మారింది. భారతీయ జనతా పార్టీకి  చెందిన వెబ్ సైట్ ను హ్యాక్ చేశారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రధాని మోదీపై మీమ్స్ను పోస్ట్ చేశారని తెలిపిన యూజర్లు.. వాటి స్క్రీన్ షాట్లను బయటపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై సెటైర్ల వేస్తూ హ్యాకర్లు మీమ్స్ పోస్టు చేశారు. సదరు మీమ్ లో జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కల్ తో ప్రధాని మోదీ  కరచాలనం చేయడానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె దూరంగా జరుగుతున్నారు. ‘సోదర సోదరీమణులారా.. నేను మిమ్మల్నందరినీ ఫూల్ చేశా.. మేమందరం మిమ్మల్ని ఫూల్స్ చేశాం. ఇంకా ఇలాంటివి చాలా రానున్నాయి. కంగ్రాట్స్..’ అంటూ మోదీ అన్నట్లుగా ఈ మీమ్స్ పోస్ట్ చేశారు. తమ వెబ్సైట్ హ్యాకింగ్కు గురైన అంశాన్ని బీజేపీ  ధ్రువీకరించాల్సి ఉంది. హ్యాకింగ్ చేసినట్లుగా ఇప్పటివరకూ ఏ సంస్థ క్లెయిమ్ చేసుకోలేదు. హ్యాకింగ్ గురైనట్లు గుర్తించగానే బీజేపీ తమ వెబ్సైట్ను నిలిపేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఆ వెబ్సైట్ ను తెరవడానికి ప్రయత్నిస్తుంటే.. ఎర్రర్ పేజీ చూపిస్తోంది. ‘సైట్ ప్రస్తుతం మెయింటెనెన్స్లో ఉంది.. త్వరలోనే తిరిగి మీ ముందుకు వస్తాం’ అనే సందేశం 
కనిపిస్తోంది. బీజేపీపై విమర్శలు సంధించడానికి సోషల్ మీడియాను విరివిగా వాడుకునే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. ఆ పార్టీకి చెందిన వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురవడంపైనా వ్యంగ్యంగా స్పందించింది. ‘ప్రస్తుతం బీజేపీ వెబ్ సైట్ ను చూడకపోతే.. మీరు చాలా మిస్సవుతారు’ అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ దివ్య స్పందన ట్వీట్ చేశారు. బీజేపీ ఛత్తీస్గఢ్కు చెందిన వెబ్సైట్ గత నెలలో హ్యాకింగ్కు గురైంది. అందులో ఏకంగా పాకిస్థాన్ జెండా కనిపించడం కలకలం సృష్టించింది. 

Related Posts