YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అంధుల కోసం కొత్త శ్రేణి నాణేలను విడుదల చేసిన ప్ర‌ధాని మోడీ

అంధుల కోసం కొత్త శ్రేణి నాణేలను విడుదల చేసిన ప్ర‌ధాని మోడీ
దృశ్య జ్ఞానం లోపించిన వ‌ర్గాల కు స్నేహ పూర్వ‌కం గా ఉండేట‌టువంటి కొత్త శ్రేణి నాణేల ను ప్ర‌ధాన మంత్రి  న‌రేంద్ర మోదీ గురువారం న్యూ ఢిల్లీ లో విడుద‌ల చేశారు.  కొత్త శ్రేణి లో భాగం గా విడుద‌లైన నాణేల లో ఒక రూపాయి, 2 రూపాయ‌లు, 5 రూపాయ‌లు, 10 రూపాయ‌లు,  20 రూపాయ‌ల వంటి వివిధ వర్గసంకేతాల తో కూడిన నాణేలు ఉన్నాయి.  లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో ఈ నాణేల ను విడుద‌ల చేసారు.   దృశ్య జ్ఞానం లోపించినటువంటి చిన్నారుల ను ఈ కార్యక్రమాని కి ప్రత్యేకంగా ఆహ్వానించారు.  ఆ బాల‌ల కు ఆతిథ్యం ఇస్తున్నందుకు ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  వారి తో భేటీ అయ్యే అవ‌కాశాన్ని కల్పించినందుకు వారి కి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.కొత్త శ్రేణి నాణేల ను చెలామ‌ణి కోసం ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేస్తూ, వరుస లోని చిట్ట‌చివ‌రి వ్య‌క్తి ని సైతం చేరుకోవాల‌నే దార్శనికత కేంద్ర ప్ర‌భుత్వాని కి మార్గాన్ని చూపుతోందన్నారు.  ఈ దార్శ‌నిక‌త ను దృష్టి లో పెట్టుకొని మరీ కొత్త శ్రేణి నాణేల కు రూపురేఖలను దిద్ది, వాటిని విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివరించారు.ప‌లు వ్య‌త్యాసభరిత అంశాల తో కూడుకొన్న ఈ కొత్త ర‌కం నాణేలు దృశ్య జ్ఞానం లోపించిన వారి కి ఎంత‌గానో స‌హాయ‌కారి అవుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ఈ కొత్త శ్రేణి నాణేలు దృశ్య జ్ఞానం లోపించిన వ‌ర్గాల కు సౌక‌ర్య‌వంతం గా ఉంటూ, వారి లో విశ్వాసాన్ని రేకెత్తించగలవని ప్ర‌ధాన మంత్రి అన్నారు. దివ్యాంగ జన స‌ముదాయం యొక్క సంక్షేమం కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొన్న వివిధ కార్య‌క్ర‌మాల ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  ఈ నాణేలు వారి యొక్క దైనందిన కార్యకలాపాల లో ఎంతో సౌలభ్యాన్ని అందించగలవని వారు అన్నారు.కొత్త నాణేల ను ఉప‌యోగించడం దృశ్య జ్ఞానం లోపించిన వారికి సులభతరం గా ఉండే విధం గా వేరు వేరు నూత‌న అంశాల ను ఆ నాణేల లో చొప్పించ‌డం జ‌రిగింది.త‌క్కువ నుండి ఎక్కువ వర్గసంకేతాలు క‌లిగిన నాణేలు ఆకారంలో మ‌రియు బ‌రువు లో విశిష్టతల ను కలిగివున్నాయి.  కొత్త గా ప్రవేశపెట్టిన 20 రూపాయ‌ల నాణెం 12 కోణాలతో ఎటువంటి పదునైన కొసలకు తావు లేనిదిగా ఉంటుంది.  మిగతా వర్గసంకేతాలకు చెందిన నాణేలు గుండ్ర‌ని ఆకారం లో ఉంటాయి.ఈ కార్య‌క్ర‌మం లో కేంద్ర ఆర్థిక మంత్రి  అరుణ్ జైట్లీ,   ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి  పొన్ రాధాకృష్ణ‌న్ లు కూడా పాల్గొన్నారు.

Related Posts