
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
హైదరాబాద్ రెహమత్ నగర్ వీడియో కాలనిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహించే పృద్వి అనే యువకుడిని డేవిడ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపివేసాడు. కిరాణా షాప్ లో సరుకులు అరువుకు ఇవ్వనందుకు డేవిడ్ గొడవకు దిగాడు. దీంతో పృధ్వీ పై రహ్మాత్ నగర్ లోని జూబ్లీహిల్స్ పీస్ ఔట్ పోస్ట్ పోలీసులకు పిర్యాదు చేసాడు. ఈ విషయంలో పోలీసులు పాటించుకోకపోవడం తో డేవిడ్ మళ్ళీ గొడవకు దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తి తో పృద్వి పై దాడి చేసి హత్య చేశాడు. కేసునమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.