YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాక్‌ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారు

పాక్‌ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఉగ్ర సంస్థలకు పాక్‌లో స్థానం ఉండబోదని ఇమ్రాన్‌ అన్న వ్యాఖ్యలపై పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కుమారుడు బిలావల్‌ భుట్టో  స్పందించారు.‘ ఇండియా-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న పరిస్థితులపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై విరుచుకుపడ్డారు.పాక్‌ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారని ఆరోపించారు. పాకిస్థాన్‌తో క్రమంగా అన్ని దేశాలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ప్రధాని ఇమ్రాన్‌ తీసుకుంటున్న చర్యల వల్లే ఇదంతా. ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే ప్రపంచ దేశాలు పాక్‌పై ఎందుకు మండిపడుతున్నాయి? ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి.ఇండియా-పాక్‌ మధ్య ఎప్పటి నుంచో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువయ్యాయి? మీరు(ఇమ్రాన్‌) నిజంగా శాంతిని కోరుకుంటుంటే ముందు ప్రపంచ దేశాల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఉగ్రవాద నియంత్రణ పట్ల నిజాయతీగా ఉన్నట్లయితే మేం చెప్పే మూడు విషయాలను తీవ్రంగా తీసుకోండి. ‘పార్లమెంట్ నేషనల్‌ సెక్యూరిటీ కమిటీని నియమించండి, ‘నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడం ఆపేయండి. లేదా వారికి దూరంగా ఉండండి’, ‘ మీ మంత్రి వర్గంలో ఉండి నిషేధిత సంస్థలతో బంధాలు కొనసాగిస్తున్న వారిపై విచారణ జరిపి వారిని తొలగించండి’.. ఈ మూడు చర్యలు ప్రభుత్వం తీసుకుంటే ఉగ్రవాద నియంత్రణకు పాక్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని మాతో పాటు అందరూ నమ్ముతారు’ అని భుట్టో పేర్కొన్నారు.

Related Posts