YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

రెవెన్యూ ఉద్యోగులకు అదనంగా ఒక నెల మూలవేతనం 

Highlights

  •  పూరైన భూరికార్డుల ప్రక్షాళన 
  • ఎవరూ సాధించని ఘనత
  • ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్  సమీక్ష
రెవెన్యూ ఉద్యోగులకు అదనంగా ఒక నెల మూలవేతనం 

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం వంద రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేసి అత్యంత క్లిష్టమైన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు. శనివారం ప్రగతి భవన్‌లో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. విధి నిర్వహణ పట్ల ఇంతటి చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన ఉద్యోగులండటం తెలంగాణ ప్రజలు, రైతుల అదృష్టంగా సీఎం అభివర్ణించారు. తెలంగాణ ప్రజలు, రైతుల పక్షాన రెవెన్యూ ఉద్యోగులకు సీఎం మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ  ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది వీఏఓలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు కలిపి మొత్తం 35,749 మంది ఉద్యోగులకు ఒక నెల మూలవేతనం అదనంగా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు ఒకనెల మూల వేతనాన్ని అదనంగా అందిస్తాం. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో భూ రికార్డుల ప్రక్షాళన నిరూపించింది. చిన్న జిల్లాలుండడం వల్లనే భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యమయింది. కొత్త కలెక్టర్ల ప్రతిభకు, పనితీరుకు ఇది గీటురాయి. కలెక్టర్లు తమ విధిని గొప్పగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికశాతం మంది అధికారులు, ఉద్యోగులు నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో ఎంతో మార్పు వచ్చింది, కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఎంతగానో కష్టపడటం వల్ల ప్రజారోగ్యం మెరుగుపడింది.
ఎవరూ సాధించని ఘనతను రెవెన్యూ ఉద్యోగులు సాధించారు
"80 ఏండ్లుగా భూరికార్డుల నిర్వహణ సరిగా లేదు. భూమి క్రయవిక్రయాలు, యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో భూరికార్డులు గందరగోళంగా మారాయి. తెలంగాణలో పంట పెట్టుబడి పథకం అమలు చేసేందుకు ఏ భూమికి ఎవరు యజమానో ఖచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూ రికార్డులను సరిచేసి పూర్తి పారదర్శకంగా పథకం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి, రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారని కేసీఆర్ ప్రశంసించారు. 

Related Posts