YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు ప్రచార యావ

Highlights

  • ఏపి,తెలంగాణ, రాష్ట్రాల ముఖ్య మంత్రిగా
  •  ఇఎస్ఎల్ నరసింహన్  ఏపీ కి మాత్రమే గవర్నర్ 
  • పెట్టుబడుల సదస్సు  ఇన్విటేషన్ లీలలు 
చంద్రబాబు ప్రచార యావ

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి  ప్రచార యావకు అంతు లేకుండా పోతుంది. ప్రచారం ఎక్కువై పోయి ఇబ్బందులు వస్తున్నా తన పద్దతి మాత్రం మార్చుకోలేక పోతున్నారు.విశాఖపట్నం లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా శనివారం ప్రారంభమైన మూడు రోజుల పెట్టుబడుల సదస్సు లో చంద్రబాబు మొదటి రోజే నవ్వుల పాలయ్యారు. తాను నవ్వులపాలవ్వటమే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహనకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చారు.ఇంతకీ జరిగింది ఏమిటంటే పెట్టుబడుల సదస్సు సందర్భంగా ఫ్రింట్ చేసిన ఇన్విటేషన్ లో చంద్రబాబు. ఏపి,తెలంగాణ, రాష్ట్రాల ముఖ్య మంత్రిగా పేర్కొన్నారు. అదే సందర్భంలో గవర్నర్ నరసింహన్ ను కేవలం ఏపీ కి మాత్రమే గవర్నర్ గా చూపించారు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరిని అడిగినా చెపుతారు ఏపి,తెలంగాణ, రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఎవరంటే..? అటువంటి ఇన్విటేషన్ లు ఫ్రింట్ చేసిన వారికి తెలియదా...చంద్రబాబు ఏ రాష్ట్ర ముఖ్య మంత్రో ఎవరో అనమకులు కాదు.కదా..ఇన్విటేషన్లను ఫ్రింట్ చేసేది.అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నప్పుడు అంత పెద్ద ఎలా జరిగింది. మొదటి రోజు సదస్సు లో మాట్లాడిన చంద్రబాబు కూడా రాష్ట్రానికి గతంలో నిర్వహించిన సదస్సుల ద్వారా లక్షల కోట్లరూపాయలు విలువైన ఎంవోయులు జరిగినట్లు చెప్పుకున్నారు. మూడు సార్లు జరిగిన పెట్టుబడుల సదస్సు లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతో అందరికీ తెలిసిందే. ఇటువంటి ప్రచార ఆర్బాటం వల్లనే చంద్రబాబును ప్రధానమంత్రి దూరం పెట్టి ఏపీని నిర్లక్ష్యం చేస్తుంది.

Related Posts