YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అతిలోక సుందరి నటి శ్రీదేవి శ్రీదేవి ఇక లేరు

Highlights

  • శనివారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి 
  • విషాదంలో చిత్ర పరిశ్రమ 
అతిలోక సుందరి నటి శ్రీదేవి శ్రీదేవి ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ చిరస్మరణీయమైన స్థానాన్ని లిఖించుకున్న దిగ్గజ నటి శ్రీదేవి ఇక లేరు. అతిలోక సుందరిగా అందరి మన్ననలు పొందిన శ్రీదేవి కన్నుమూశారు. శనివారం అర్థరాత్రి ఆమె గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది. ఆమె తుది శ్వాస విడిచి సమయంలో శ్రీదేవి చెంత భర్త భోనికపూర్, కుమార్తె ఖుషి ఉన్నారని సమాచారం. 55 ఏళ్ల శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్లు ఆమె మరిది సంజయ్ కపూర్ ధృవీకరించారు. విషయం తెలిసిన వెంటనే అనేకమంది ముంబైలోని శ్రీదేవి ఇంటికి చేరుకుంటున్నారు. అక్కడే ఉన్న ఆమె కుమార్తె జాహ్నవిని పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.

ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబంతో సహా శ్రీదేవి ప్రస్తుతం దుబాయిలో వున్నారు. అర్ధరాత్రి ఆమె గుండెపోటుకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలిసింది. “శ్రీదేవి ఇక లేరు. నేను దుబాయి నుంచి ఇప్పుడే వచ్చాను. కానీ వెంటనే తిరిగి దుబాయి వెళ్తున్నాను. రాత్రి 11… 11:30 సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇంతకు మించి నాకు వివరాలు తెలియవు'” అని సంజయ్ కపూర్ జాతీయ మీడియాతో తెలిపారు.

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వత హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి అక్కడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. బాల నటిగా నట జీవితాన్ని ప్రారంభించిన శ్రీదేవి దేశంలోనే ఒక పెద్ద తారగా ఎదిగారు. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. 2013లోనే ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

Related Posts