YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

1న రాజమండ్రిలో మోదీ బహిరంగ సభ

1న రాజమండ్రిలో మోదీ బహిరంగ సభ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరోసారి ఏపీకి రానున్నారు. ఏప్రిల్‌ 1న రాజమహేంద్రవరంలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక్కడి స్పిన్నింగ్‌ మిల్లు మైదానంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే సభలో మోదీ ప్రసంగిస్తారని భాజపా నేత సోము వీర్రాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందన్నారు. రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే సీఎం చంద్రబాబు 2లక్షలు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతోంది రూలింగ్‌ కాదు.. ట్రేడింగ్‌ అని ఆరోపించారు.

Related Posts