YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

శ్రీదేవి భౌతికాయ తరలింపులో జాప్యం

Highlights

  • పోస్టుమార్టామే లోపం 
  • ఈ సాయంత్రానికి ముంబై చేరే అవకాశం 
  • ముంబైకి చేరిన ప్రముఖులు 
శ్రీదేవి భౌతికాయ తరలింపులో జాప్యం

సినీ నటి శ్రీదేవి  భౌతికకాయానికి పోస్టుమార్టం ఇప్పటికి పూర్తయినట్టు తెలుస్తోంది. నివేదిక తర్వాత ఆమె భౌతికకాయాన్ని అప్పగించనున్నారు.  అయితే డెత్ సర్టిఫికెట్ విడుదలలో ఆలస్యమైందని సమాచారం. శనివారం రాత్రి 11గంటలకు దుబాయ్‌లోని ఓ హోటల్‌లో కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో సినీ పరిశ్రమ మూగబోయింది.

ఇదిలా ఉంటే, దుబాయ్ నుంచి ఆమె భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నానికి ముంబైకి తరలిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత దౌత్యపరమైన కారణాల వల్ల ఆలస్యమైందని.. రాత్రి 8లోపు ఆమె భౌతికకాయాన్ని అప్పగించే అవకాశమున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే పోస్ట్‌మార్టం జాప్యం కారణంగా సకాలంలో ఆమె భౌతుకకాయాన్ని ముంబాయికి తరలించండంలో మరింత ఆలస్యమవుతుంది. .

సోమవారం సాయంత్రానికి  శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి కడసారి చూపు కోసం ముంబైలోని ఆమె నివాసానికి బంధువులు, అభిమానులు ఇప్పటికే భారీగా చేరుకున్నారు.  టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు.

Related Posts