Highlights
- పోస్టుమార్టామే లోపం
- ఈ సాయంత్రానికి ముంబై చేరే అవకాశం
- ముంబైకి చేరిన ప్రముఖులు
సినీ నటి శ్రీదేవి భౌతికకాయానికి పోస్టుమార్టం ఇప్పటికి పూర్తయినట్టు తెలుస్తోంది. నివేదిక తర్వాత ఆమె భౌతికకాయాన్ని అప్పగించనున్నారు. అయితే డెత్ సర్టిఫికెట్ విడుదలలో ఆలస్యమైందని సమాచారం. శనివారం రాత్రి 11గంటలకు దుబాయ్లోని ఓ హోటల్లో కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో సినీ పరిశ్రమ మూగబోయింది.
ఇదిలా ఉంటే, దుబాయ్ నుంచి ఆమె భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నానికి ముంబైకి తరలిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత దౌత్యపరమైన కారణాల వల్ల ఆలస్యమైందని.. రాత్రి 8లోపు ఆమె భౌతికకాయాన్ని అప్పగించే అవకాశమున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే పోస్ట్మార్టం జాప్యం కారణంగా సకాలంలో ఆమె భౌతుకకాయాన్ని ముంబాయికి తరలించండంలో మరింత ఆలస్యమవుతుంది. .
సోమవారం సాయంత్రానికి శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి కడసారి చూపు కోసం ముంబైలోని ఆమె నివాసానికి బంధువులు, అభిమానులు ఇప్పటికే భారీగా చేరుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు.