YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

న్యాయస్థానాలపై గౌరవం ఉండాలి: ఉప రాష్ట్రపతి

న్యాయస్థానాలపై గౌరవం ఉండాలి: ఉప రాష్ట్రపతి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
న్యాయస్థానాలపై ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో న్యాయస్థానాలు ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో ఉపరాష్ట్రపతి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖతో తన అనుబంధం విడదీయారనిదని పేర్కొన్నారు. తన ఎదుగుదల అన్ని విధాలా ఇక్కడి నుంచే ఆరంభమైందన్నారు. న్యాయస్థానాలకు 125 ఏళ్ల చరిత్ర ఉండడం ఎంతో విశేషంతో కూడుకున్నదని చెప్పారు. తెన్నేటి విశ్వనాథం వంటి మహానుభావులు ఇక్కడి నుంచే వృత్తి జీవితాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. దేశంలో 3.12 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 130 కోట్ల భారతీయుల విశ్వాసాన్ని కోర్టులు నిరంతరం పరిరక్షిస్తూనే ఉన్నాయని కొనియాడారు.

Related Posts