YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.  ఓట్ల  లెక్కింపు సందర్భంగా ఈవీఎంల్లోని బ్యాలెట్లతోపాటు, వీవీప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించాలని వివిధ పార్టీలు  పిటిషన్లు  దాఖలు చేసాయి. పారదర్శకత కోసం వీవీప్యాట్లలోని 50 శాతం స్లిప్పులు లెక్కించాలని చంద్రబాబుతో సహా పలు మిగిలిన పక్షాలు పిటిషన్ లో పేర్కోన్నాయి. రాబోయే ఎన్నికల్లో వీవీ ప్యాట్లను లెక్కిస్తేనే లెక్కింపు చాలా పారదర్శకంగా ఉంటుందంటూ వివిధ పార్టీల నేతలు పిటీషన్ లో పేర్కొన్నయి.  ఏదో ఒక బూత్ లోని  ఒక శాతం ఓట్లను వీవీ ప్యాట్లలో లెక్కిస్తే సరిపోతుందని  పలు కేసుల సందర్భంగా ఎన్నికల కమిషన్ కు  సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు చేయాలని తమ పిటిషన్ లో కోరారు. పిటిషన్ ను  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్  గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈసీ కౌంటర్ అఫిడవిట్ పై  సమాధానానికి కొంత సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు.  వాదనలు విన్న న్యాయస్థానం వచ్చే సోమవారం నాటికి వాయిదా వేసింది. 

Related Posts