YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కర్రాన్‌ హ్యాట్రిక్‌.. ఢిల్లీపై అద్భుత విజయం సాధించిన పంజాబ్..!!

కర్రాన్‌ హ్యాట్రిక్‌..  ఢిల్లీపై అద్భుత విజయం సాధించిన పంజాబ్..!!

 యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ దారుణంగా చతికిలపడింది. అటు చేజారుతున్న మ్యాచ్‌ను పంజాబ్‌ పేసర్లు సామ్‌ కర్రాన్‌ (4/11), షమి (2/27) అద్భుత బంతులతో విరుచుకుపడి కాపాడారు. దీంతో 14 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు గెలిచింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 166 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌ (30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), సర్ఫరాజ్‌ (29 బంతుల్లో 6 ఫోర్లతో 39) రాణించారు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీ 19.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (39), ఇన్‌గ్రామ్‌ (38), ధవన్‌ (30) రాణించారు. అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కర్రాన్‌ నిలిచాడు.

Related Posts