YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

హైదరాబాద్ లో శ్రీదేవి సంతాప సభ

Highlights

  • శ్రీదేవి మృతి చిత్ర పరిశ్రమకు  తీరని లోటు
  • దేశవ్యాప్తంగా  అభిమానులు
  • పద్మశ్రీ అవార్డు తో పాటు  15 ఫిలింఫేర్ అవార్డులు
హైదరాబాద్ లో శ్రీదేవి సంతాప సభ

సౌంద్యాల రాశి శ్రీదేవి మృతి చిత్ర పరిశ్రమకే కాకుండా ఆమె అభిమానులకు తీరని లోటని తెలంగాణ‌ సినిమాటోగ్రఫీ శాఖ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ లో త్వరలో చిత్ర ప‌రిశ్ర‌మ‌ ప్రముఖుల సమక్షంలో సంతాప సభ నిర్వహించనున్నట్లు ప్ర‌క‌టించారు. సోమవారం  ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసి, అలనాటి అగ్ర నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులతో పాటు అనేకమంది నటులతో అనేక చిత్రాలలో నటించి, తన నటనతో అభిమానులను మెప్పించిన నటి శ్రీదేవి అని పేర్కొన్నారు.
తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ తదితర భాషలలో సైతం నటించిన శ్రీదేవి.. దేశం మొత్తం మీద అభిమానులను సంపాదించుకున్నార‌ని తలసాని అన్నారు. తన నటనకు గాను పద్మశ్రీ అవార్డు, 15 ఫిలింఫేర్ అవార్డులను ఆమె అందుకున్నారని తెలిపారు.  

Related Posts