YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ముంబైలో డాగ్‌స్క్వాడ్ తనిఖీల కలకలం

Highlights

  • దుబాయ్ పోలీసుల ఆదేశాలతోనే..
  • శ్రీదేవికి కడసారి నివాళులర్పిందుకు సిద్ధమవుతున్న ముంబై
ముంబైలో డాగ్‌స్క్వాడ్ తనిఖీల కలకలం

ప్రముఖ నటి  శ్రీదేవి మృతిపై విభిన్న కథనాలతో జరుగుతున్న విస్తృత ప్రచారం పరంపరలో  ఆమె ఇంట్లో డాగ్ స్క్వాడ్ తనిఖీల వార్త కలకలం రేపుతుంది. శ్రీదేవి భౌతిక కాయం  ఇంకా ఇంటికి రాకముందే ఈ  తనిఖీలు నిర్వహించాల్సిన అవసరమేంటన్న సందేహాలు సర్వత్రా వ్యతికమవుతున్నాయి.. తనిఖీల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటూ ఆరా తీస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ తనిఖీలు నిర్వహించారా? లేక, శ్రీదేవి మృతిపై క్షణక్షణానికి పెరుగుతున్న అనుమానాల నేపథ్యంలో ముంబై పోలీసులే ఈ తనిఖీలు నిర్వహించారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. మరో పక్క తమ అభిమాన నటి పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆమె ఇంటికి చేరుకుంటున్నారు.  ఈ క్రమంలో తెలుగు, తమిళ చిత్రరంగాలకు చెందిన ప్రముఖులతోపాటు పలువురు ముంబై చేరుకున్నారు. దీంతో శ్రీదేవి ఇంటి పరిసర ప్రాంతాలు జనసమ్మర్థంగా మారాయి.

Related Posts